News

పార్లమెంటు క్యాంటిన్లకు రూ.60.7 కోట్ల సబ్సిడీ


గత ఐదు సంవత్సరాల్లో పార్లమెంటు క్యాంటిన్లకు రూ 60.7 కోట్లు సబ్సిడీగా ఇచ్చారు. పూరీ, కూర తదితర పదార్థాలను సభ్యులకు 88 శాతం సబ్సిడీ రేట్లపై అందించారు. ఇంకా ఫిష్‌ ప్రై రూ 25, మటన్‌ కట్‌లెట్‌ రూ 18, ఆయిల్‌తో కూడిన కూరగాయాలు రూ 5, మటన్‌ కర్రీ రూ 20, మసాలా దోశ రూ 6 లకు సబ్సిడీ రేట్లపై అందిస్తున్నట్లు ఆర్‌టిఐ సమాచారంలో తెలిసింది. 2009-10 లో 10.4 కోట్లు, 2010-11లో 11.7 కోట్లు, 2012-13 లో 12.5 కోట్లు, 2013-14 లో 14కోట్లు పబ్సిడీగా ఇచ్చారు